Sunday, March 23, 2014

Okariki Neevu Sahaayam Cheyalanukunte



--
-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-

Friday, June 22, 2012

అబద్దాన్ని అందంగా చూపిస్తే నిజం కుడా దాని వెంట పడుతుంది, కాని నిజమైన అందం మనసును తాకుతుంది కంటిని కాదు...!

అబద్దాన్ని అందంగా చూపిస్తే నిజం కుడా దాని వెంట పడుతుంది,
కాని నిజమైన అందం మనసును తాకుతుంది కంటిని కాదు...! @ భారతీయులం | Karthik Garu 

Monday, June 4, 2012

చరిత్ర లో ఈరోజు june 4,పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం(శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు జన్మించాడు.

చరిత్ర లో ఈరోజు june 4
పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం(శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు మరియు నటుడు. తెలుగువారు అభిమానముగా బాలు అని పిలిచే ఈయన 1946 జూన్ 4 న అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామములో (ప్రస్తుతము ఈ గ్రామము తమిళనాడు రాష్ట్రములో ఉన్నది) ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు.
బూదరాజు రాధాకృష్ణ ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సీనియర్‌ పాత్రికేయుడు. పాత్రికేయులకు భాషాభిమానులకు విశేషంగా ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించాడు. తెలుగు, సంస్కృత భాషల్లో మంచి పట్టున్న రాధాకృష్ణ వాస్తు పదకోశం, వ్యవహారకోశం మొదలైన భాషా సంబంధ పుస్తకాలను రచించారు. ఆధునిక పత్రికల తెలుగు భాషను ప్రామాణీకరించిన ఘనత ఆయనకు చెందుతుంది.@ భారతీయులం  

Saturday, June 2, 2012

మనలో కలిగే ఒత్తిడి వలన మనలో జరిగే కొన్ని నష్టాలు మీ కోసం. ఒత్తిడిని ఎదురు కొండి ! తక్కువ స్ధాయిలో వుండే ఒత్తిడి, ఉద్రిక్తత కొన్ని సందర్భాలలో లాభదాయకంగానే ఉంటాయి.

ఒత్తిడిని ఏదైనా శారీరక, రసాయనిక లేక భావావేశపూరిత, ఉద్విగ్నభరితమైన ఆంశంగానైనా పరిగణించవచ్చు, అలాగే, శారీరక లేక మానసిక అశాంతిని, ఆందోళనను కలిగించడంతో ఈ వ్యాధి సంక్రమించడానికి ఇది ఒక హేతువుగా, సకారణయుతమైన అంశం కూడా కావచ్చు. ఒత్తిడిని కలుగజేసే శారీరక మరియు రసాయనిక అంశాలు తీవ్ర గాయం, అఘాతం, అంటురోగాలు, జీవ విషాలు (టాక్సిన్స్), అనారోగ్యం మరియు ఏ విధమైన ఇతర గాయాలతోనైనా కూడి వుండవచ్చు. ఒత్తిడికి, ఉద్రిక్తతకు గల భావావేశపూరితమైన కారణాలనేకమై, వివిధ రకాలుగా కూడా ఉంటాయి. 'ఒత్తిడి' అనే మాట మానసిక ఒత్తిడితో సంబంధం కలగినదిగా భావిస్తున్నప్పటికీ, శాస్త్రజ్ఞులు మరియు వైద్యులు మాత్రం ఇదే మాటను శరీరం నిర్వహించే విధులలో స్ధిరత్వాన్ని మరియు సమతుల్యతను మందగింపచేసే ఒక బలీయమైన శక్తిగా వ్యక్తీకరిస్తూ ఉంటారు. తమ చుట్టుపక్కల ఏదైనా జరుగుతున్నప్పుడు దాని ద్వారా ఒత్తిడికి గురైనట్లు భావించే చాలామంది తమ శరీరాలు రసాయనాలను రక్తంలోకి విడుదల చేస్తున్నట్లుగా ప్రతిస్పందిస్తారు. ఇటువంటి రసాయనాలు వీరికి ఎంతో శక్తిని మరియు బలాన్ని కలుగజేస్తాయి.

తక్కువ స్ధాయిలో వుండే ఒత్తిడి, ఉద్రిక్తత కొన్ని సందర్భాలలో లాభదాయకంగానే ఉంటాయి. ఉదాహరణకుః ఒక ప్రోజెక్ట్ లేక మరేదైనా పనిని నిర్వహస్తున్నప్పుడు తక్కువ స్ధాయిలో ఒత్తిడికి గురవుతున్నట్లుండే భావం, మనల్ని మనం చేసే పనిని దానిమీదే మరింతగా దృష్టిని కేంద్రీకరించి ఉండగలిగేటట్లు మరియు పనిని మరింత బాగా, మరింత శక్తివంతంగా, ఉత్సాహవంతంగా పూర్తి చేసేటట్లు చేస్తుంది, ఒత్తిడిలో రెండు రకాలున్నాయిః స్ట్రెస్ ('అనుకూలవంతమైన ప్రోత్సాహకరమైన ఒత్తిడి') మరియు డిస్ట్రెస్ ('ప్రతికూలమైన, నిరుత్సాహకరమైన ఒత్తిడి') ఉజ్జాయింపున చెప్పాలంటే ఛాలెంజ్ మరియు అదనపు బరువు. ఒత్తిడి ఉధృతంగా ఉన్నప్పుడు లేక అతి తక్కువగా అదుపులో ఉన్నప్పుడు, అలాగే నిర్వహింపబడుతున్నప్పుడు, అది ప్రతికూలమైన సానుకూలం కానటువంటి ప్రభావాలకు కారణమవుతుంది.@ భారతీయులం  

Friday, June 1, 2012

హెచ్ఐవి వైరస్ మనుషులకు మాత్రమే సోకుతుంది. ఎయిడ్స్ ఎక్కడ నుండి వచ్చింది? ఎయిడ్స్ ఇలా వ్యాపించదు.AIDS అనేది ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోంకు పొడి పేరు. శరీరంలో రోగనిరోధక శక్తి, బాహ్య కారణాల వల్ల తగ్గ్గడం అన్నమాట.

విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాదిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చె ఋగ్మతలను నయం చేసె మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాదిని మధుమేహం మరియు హైపర్ టెన్షన్ లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడ దీర్ఘకాలిక మరియు నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగె వ్యాధిగా వ్యవహరిస్తున్నారు. ఇది హెచ్.ఐ.వి (హ్యూమన్ ఇమ్మ్యునోడెఫిసియెన్సీ వైరస్)అను వైరస్ వలన వస్తుంది. AIDS అనేది ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోంకు పొడి పేరు. శరీరంలో రోగనిరోధక శక్తి, బాహ్య కారణాల వల్ల తగ్గ్గడం అన్నమాట. హెచ్ఐవి వైరస్ మనుషులకు మాత్రమే సోకుతుంది.

ఎయిడ్స్ ఎక్కడ నుండి వచ్చింది?
శాస్త్రఙుల అంచనా ప్రకారం హెచ్ఐవి వైరసు సోకిన మొదటి వ్యక్తి ఆఫ్రికా ఖండంలోనే ఉండాలి. ఇది 1915, 1941ల మధ్య జరిగి ఉండవచ్చని ఊహిస్తున్నారు. అప్పట్లో అక్కడ గ్రీన్ చింపాంజీలకు ఎస్ఐవి(SIV)సోకుతూ ఉండేది, ఇది హెచ్ఐవిగా రూపాంతరం చెంది మనుషులకు సోకటం ప్రారంభించింది అని చెబుతారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం జూన్ 18, 1981న అమెరికాలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదయింది. దీనిని మొదట స్వలింగ సంపర్కంలో పాల్గొనే పురుషులకు సోకే వ్యాధి అని అపోహ పడ్డారు. కాని వచ్చిన కేసులలో సగంపైగా స్వలింగ సంపర్కంలో పాల్గొనని వారు కావటం వలన అందరికీ వచ్చే జబ్బుగా నిర్ధారించారు.


ఎయిడ్స్ ఇలా వ్యాపించదు
ఈ క్రింది మార్గాలలో ఎయిడ్స్ వ్యాధి వ్యాపించదు
    దోమ కాటు,పిల్లుల కాటు,కుక్క కాటు, దగ్గు, తుమ్ముల వల్ల, ముద్దుల వల్ల
    స్పర్శించటం వలన,హెచ్‍ఐవి/ఎయిడ్స్ సోకిన వ్యక్తిని కౌగలించుకొవడం వలన
    వ్యాధిగ్రస్తుని బట్టలు ధరించటం వలన,ఒకే మరుగు దొడ్లను, ఒకే స్విమ్మింగ్ పూల్‌‌లను ఉపయోగించటం ద్వారా
    ఎయిడ్స్‌గల వారితో కలిసిమెలిసి జీవించడం వల్ల
    ఎయిడ్స్‌పీడితుల సంరక్షణ బాధ్యతవహించేవారికి ఆ కారణంగా ఇది సోకడం జరగదు.
    హెచ్‍ఐవి/ఎయిడ్స్ ఉన్నవారితో కలసి పనిచేయడం వలన సంక్రమణకు గురయ్యే ప్రమాదం ఎంతమాత్రం లేదు.@ భారతీయులం  

చరిత్ర లో ఈరోజు june 1,అంతర్జాతీయ బాలల దినోత్సవం (జూన్‌ 1), ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చినది., భారత్‌లో మొదటి డీలక్స్‌ రైలు (దక్కన్‌ క్వీన్‌) బొంబాయి - పూణేల మధ్య ప్రారంభమైంది. etc.,

చరిత్ర లో ఈరోజు june 1
అంతర్జాతీయ బాలల దినోత్సవం (జూన్‌ 1): 1948వ సంవత్సరంలో ప్రపంచ మహిళా సమాఖ్య ప్రతి సంవత్సరం జూన్‌ 1వ తేదీన అంతర్జాతీయ బాలల దినోత్సవం జరపాలని నిర్ణయించింది. నాటి నుండి వంద దేశాలకు పైగా.. ఈ తేదీన బాలల దినోత్స వాన్ని జరుపుకుంటున్నాయి. అయితే.. కొన్ని దేశాల్లో బాలల దినోత్సవానికి కొన్ని ప్రత్యేక రోజులున్నాయి. ఉదాహరణకు మనదేశంలో భారత తొలి ప్రధాని పండిట్‌ జవహరాల్‌ జన్మదినమైన నవంబర్‌ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం.
1874: ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చినది.
1930: భారత్‌లో మొదటి డీలక్స్‌ రైలు (దక్కన్‌ క్వీన్‌) బొంబాయి - పూణేల మధ్య ప్రారంభమైంది.
1955: అస్పృశ్యతను (అంటరానితనం) నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.
1964: నయాపైసా, పైసాగా మార్చబడింది.
1968: హెలెన్‌ కెల్లర్‌ మరణించింది.
1975: ఒలంపిక్‌ క్రీడలలో పతకం సాధించి న తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి జన్మించింది.
1979: విజయనగరం జిల్లా యేర్పాటు. 
1996: భారత మాజీ రాష్టప్రతి, ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మరణం.
2001: నేపాల్‌ రాజ ప్రాసాదంలో రాకుమా రుడి మారణకాండ.@ భారతీయులం  

Thursday, May 31, 2012

పొగత్రాగటం ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారి పోయింది, రోడ్డు మీదకు వచ్చి చూస్తే నూటికి తొంభెై మంది మగవారి చేతుల్లో ఒక సిగరెట్టో.....ధూమపానం - దుష్ర్పభావాలు...పిల్లలపెై ప్రభావం...భారత దేశ నేపథ్యం...సిగరెట్‌ వల్ల కలిగే హానీ..

పొగత్రాగటం ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారి పోయింది, రోడ్డు మీదకు వచ్చి చూస్తే నూటికి తొంభెై మంది మగవారి చేతుల్లో ఒక సిగరెట్టో, బీడీనో, లేక ఏదో ఒక పొగాకు ఉత్పత్తి చూడవచ్చు. కొన్ని అభివృద్ధి చెందిన నగరాలలో అయితే ఆడవారు కుడా ధూమ పానం చేస్తున్నారనుకోండి. రోజుకొకసారి ధూమపానం చేసేవారికి, వారి ఆయువు ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక సంవత్సరం ఆయు వు తగ్గుతుందని, ప్రపంచ ఆరోగ్యసంస్థ ఎప్పు డో వెల్లడించిన సంగతి అందరికి తెలిసిందే. అయినా ఎవ్వరూ ధూమపానం మానకుండా, వారి ఆరోగ్యమే కాకుండా పక్కవారి ఆరోగ్యా న్ని కూడా నాశనం చేస్తున్నారు. ప్రపంచమం తా ఈరోజు పొగాకు వ్యతిరేకదినం అని తెలి సినా, మన వాళ్ళెవరికీ పట్టనట్లు గుప్పుగుప్పు మంటూ దమ్ము కొడుతున్నారు.

 ప్రభుత్వం బహి రంగ ప్రదేశాల్లో పొగాకు వాడకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం 2002 సంవత్సరంలో ఓ చట్టాన్ని చేసింది. 'ఆంధ్రప్రదేశ్‌ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ స్మో కింగ్‌ అండ్‌ హెల్‌‌త ప్రొటెక్షన్‌ యాక్ట్‌' కింద బ హిరంగ ప్రదేశాలు, ప్రజలు సాధారణంగా తిరిగే ప్రదేశాల్లో పొగతాగరాదు.

పొగాకు వ్యతిరేక దినం...
1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశా లు ప్రజలలో పొగాకు వినియోగం వల్ల కలిగే హాని పట్ల అవగాహన పెంచి, అప్రమత్తుల్ని చేసే లక్ష్యంతో ధూమపాన వ్యతిరేక దినోత్స వాన్ని పాటించాలని భావించాయి. తదనుగు ణంగా 1988 నుంచి ప్రతి సంవత్సరం మే 31న ఈ దినోత్సవాన్ని జరిపి ప్రజలకు పొగ త్రాగడం వలన వచ్చే అనారోగ్యం గురించి తెలియ జెప్పడమే ముఖ్య ఉద్దే్యశంగా పెట్టుకు న్నాయి. సమాజంలో స్వచ్ఛంద సంస్థలు, ప్ర భుత్వ ఉద్యోగ సంఘాలు, అన్ని పాఠశాలలు ఈ రోజు స్వచ్ఛందంగా ర్యాలీలు, సభలు, స మావేశాలు జరిపి ధూమపానం వలన జరిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తున్నాయి.

ధూమపానం - దుష్ర్పభావాలు...
మన దేశంలో సంవత్సరానికి దాదాపు 90 వేల మంది ప్రజలు పొగాకు వల్ల సంభవించే రోగాలతోనే మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. పురుషులలో 56.4 శాతం, స్ర్తీలలో 44.9 శాతం కాన్సర్లకు కారణం పొ గాకు వాడకం వల్లే. ప్రపంచంలో ఎక్కడా లే నంత ఎక్కువగా గొంతు కాన్సర్‌ భారత దేశం లో వ్యాపిస్తోందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. సిగరేట్‌ తాగగానే నికోటిన్‌, ఇతర రసాయ నాలు శరీరంలోకి వెళ్లి తీవ్ర ప్రభావాన్ని చూ పుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒకసా రి సిగరెట్‌ తాగితే చాలా రకరకాల రసాయ నాలు శరీరంలోకి వెళ్తాయి. శరీంలోకి ప్రవే శించిన రసాయనాల్లో దాదాపు 40 నుండి 50 క్యాన్సర్లను కలిగించేవే. వాటితో పాటు తారు, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటివి శరీరం లోకి ప్రవేశిస్తాయి. మాములుగా ఊపిరి తి త్తుల్లో తమను తాము శుభ్రం చేసుకునే యం త్రాంగం ఉంటుంది. ఈ అలవాటు వలన అవి తమ సామార్థ్యాన్ని కోల్పోతాయి. ఆ కా లుష్యాన్ని బయటికి తీసుకురావడానికి పొడి దగ్గు మొదలవుతుంది.
                                 దీనినే స్మోకర్స్‌ కాఫ్‌ అని అంటారు. ప్రపం చంలో పొగాకు వాడకం వల్ల నోటి క్యాన్సర్‌ కేసుల సంఖ్య భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి. భారతదేశంలో పురుషుల్లో క్యాన్సర్‌ వ్యాధికి 56.4% కారణం కాగా మహిళల్లో 44.9% కారణమయ్యింది. ఊపిరితిత్తులకు వచ్చే క్యా న్సర్‌ 82%, ఇతర వ్యాధులకు 90% కార ణం పొగాకు వాడకం మాత్రమే. పొగాకు వా డకం గుండె రక్తనాళాల వ్యాధికి దారితీస్తుంది. ఇంకా గుండెపోటు, ఛాతిలో నొప్పి, హృద్రో గంతో ఆకస్మిక మరణం, మెదడుకు పక్షవా తం, నాడి సంబంధ వ్యాధులకు కూడ పోగా కు ద్రోహదం అవుతున్నట్లు తెలుస్తుంది.

పిల్లలపెై ప్రభావం...
సెకండ్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌ కారణంగా పిల్లల్లో అస్తమా రోగుల సంఖ్య నానాటికి పెరుగు తోంది. ధూమాపానం ద్వారా వచ్చే పొగ వలన న్యుమోనియా లేదా శ్వాసతో పాటు వచ్చే దగ్గు (పల్మోనరీ బ్రాంకైటిస్‌) ఉత్పన్న మవుతుంది. పిల్లలో వినికిడి, వాచక సమ స్యలు తలెత్తుతాయి. ధూమాపానం చేసే వారి ఇండ్లలో పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. దీంతో వారిలో వ్యాధినిరోధక సమస్యలు ఉత్పన్న మవుతాయి. ఈ కారణం గా పిల్లలు యువావస్థలోకి వచ్చే ముందు ఇతరులకన్నా బలహీనంగా తయారవుతారు.
ప్రతి 8 సెకండ్లకు పొగాకు కారణంతో ఒక రు మృతి చెందుతున్నట్లు తెలుస్తుంది. అందు లో భాగంగా భారతదేశంలో పొగాకు వాడకం వల్ల మృతి చెందుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా 8 నుంచి 9 లక్షల మధ్య ఉంటుంది. పురుషుల్లో నపుంసకత్వానికి కారణమవుతుం ది. అలాగే మహిళల్లో ఈస్ట్రోజోన్‌ హర్మోన్ల సంఖ్య తగ్గుతుంది. అరగంటసేపు పొగాకును నమిలితే 4 సిగరెట్లు తాగడంతో సమానమైన నికోటిన్‌ను మింగినట్లవుతుంది. పొగాకు నమిలేవారిలో నోరు, గొంతు క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఆరోగ్యవంతులకంటే 50 రెట్లు ఎక్కువగా ఉంటుందని వెైద్యులు చెబు తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు కారణమవుతున్న ప్రధాన 8 వ్యా ధులలో 6 వ్యాధులకు పొగాకు ఉమ్మడి రిస్క్‌ గా ఉంటుంది. మొత్తంగా 20వ దశాబ్దంలో 100 మిలియన్ల మరణాలు కేవలం పొగాకు సంబంధితంగా సంభవించినట్లు సర్వేలు తెలుపుతున్నాయి

భారత దేశ నేపథ్యం...
* మనదేశంలో సాలీనా 8 నుండి 9 లక్షల మరణాలు పొగాకు సంబంధమైనవిగా ఉంటున్నాయి.
* రోజూ 2200 మందికిపెైగా భారతీయులు పొగాకు వాడకం సంబంధిత మరణాలకు గురవుతున్నారు.
* రోజూ కొత్తగా 5500 మంది యువత పొగతాగేవారి జాబితాలో చేరుతున్నారు.
* ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో 
నోటి క్యాన్సర్‌ కేసులు భారతదేశంలో నమోదవు తున్నాయి. వీటిలో 90 శాతం పొగాకు వాడకం ఫలితంగా సంభవిస్తున్నాయి.
* భారతదేశంలో నమోదవుతున్న 
మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో దాదాపు సగం కేసులు వివిధ రూపాల్లో పొగాకు వాడకం ఫలితంగా సంభవిస్తున్నవే.

సిగరెట్‌ వల్ల కలిగే హానీ..
1. ధూమపానం వల్ల శ్వాసనాళాలు దెబ్బతింటాయి.
2. శ్వాసనాళంపెై గోడలు గట్టిపడి వదిలే గాలిలోని మలినాలు బయటకు పోవడం తగ్గిపోతుంది.
3. సంకోచ, వ్యాకోచాలు తగ్గి క్రానిక్‌ బ్రాం కైటిస్‌, ఆఫ్‌స్లైక్టివ్‌ పల్మనరీ వ్యాధులు వస్తాయి.
4. కడుపులో ఉదరకోశ పొరలు దెబ్బతిని అల్సర్‌, గ్యాస్‌ ట్రబుల్‌, సమస్యలు తలెత్తుతాయి.
5. గుండెకు సంబంధించిన రక్తనాళాలు దెబ్బతిని బిపి, గుండెపోటు సంభవిస్తాయి.
6. మెదడులోని రక్తనాళాలు చిట్లి పక్షవా తం, నరాల బలహీనత ఏర్పడుతాయి.
7. ఆయాసం పెరిగి ఇసినోఫిలిస్‌, గ్యాలినోమా అనే వ్యాధికి దారితీస్తుంది.@ భారతీయులం 

Ads by Smowtion